అంతేగాకుండా ఆయనపై అందిన ఫిర్యాదుకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని, దాంతో పాటు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడానికి సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు, ఇతర డాక్యుమెంట్స్ తో విచారణకు హాజరు కావాల్సిందిగా.. నోటీసుల్లో ఆదేశించారు. కాగా వెంకటరత్నం వీసీగా పని చేసిన సమయంలో దాదాపు 37 మంది మినిమం టైమ్ స్కేల్ ఎంప్లాయిస్ ను ప్రభుత్వ అనుమతి లేకుండా, నిబంధలనకు విరుద్ధంగా రెగ్యులరైజ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి.