సీరియస్గా సర్కారు..
గంజాయి, డ్రగ్స్ విషయంలో తెలంగాణ సర్కారు సీరియస్గా ఉంది. తెలంగాణలో డ్రగ్స్, గంజాయి పదాలు వినపడొద్దని సీఎం రేవంత్ రెడ్డి గట్టి పట్టుదలతో ఉన్నారు. వీటి నిర్మూలన కోసం టీ-న్యాబ్ను ఏర్పాటు చేసి పటిష్ఠమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. టీ-న్యాబ్ డైరెక్టర్గా సీనియర్ ఐపీఎస్ అధికారిని నియమించారు. ఆయన ఆధ్వర్యంలోని బృందం హైదరాబాద్ నగరం సహా.. తెలంగాణలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు కృషి చేస్తోంది.