స్థానికంగా ఎలాంటి ఉపాధి అవకాశాలు లేకపోవడంతో.. తెలంగాణ యువకులు మళ్లీ గల్ఫ్ దేశాల బాట పట్టి మోసపోతున్నారు. గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయి.. గడిచిన ఆరు నెలల్లో 21 మంది కామారెడ్డి వాసుల మృతిచెందారు. ఉద్యోగాల పేరితో ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షలు వసూలు చేసి గల్ఫ్ దేశానికి పంపి ఏజెంట్లు మోసం చేస్తున్నారు. ఇక్కడ ఉపాధి అవకాశాల్లేక.. వ్యవసాయం గిట్టుబాటు కాక.. ఉత్తర తెలంగాణ జిల్లాలు నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, అదిలాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, మెదక్ నుంచి సుమారు 3 లక్షల మంది గల్ఫ్ దేశాల బాట పట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here