ఆగస్ట్ 20 నుంచి నోటిఫికేషన్స్

జమ్మూకశ్మీర్లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో తొలి దశలో సెప్టెంబర్ 18న 24 సీట్లకు, రెండో దశలో సెప్టెంబర్ 25న 26 స్థానాలకు, మూడో దశలో అక్టోబర్ 1వ తేదీన 40 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్లు ఆగస్ట్ 20వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. తొలి దశ ఎన్నికలు జరిగే సెప్టెంబర్ 18వ తేదీ గెజిట్ నోటిఫికేషన్ ఆగస్టు 20న విడుదల అవుతుంది. రెండో దశ ఎన్నికల కోసం ఆగస్టు 29న, మూడో దశ ఎన్నికల కోసం సెప్టెంబర్ 9న నోటిఫికేషన్లు విడుదల అవుతాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు కేంద్రపాలిత ప్రాంతంలో పర్యటించిన వారం తర్వాత ఈ ప్రకటన వెలువడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here