National Awards 70వ నేషనల్ ఫిల్మ్ అవార్డులను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఈ సారి నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో మలయాళం, కన్నడ, తమిళ సినిమాలు ఎక్కువగా అవార్డులను గెలుచుకున్నాయి. తెలుగు సినిమాకు నిరాశే ఎదురైంది. బెస్ట్ ఫిల్మ్గా మలయాళం మూవీ ఆట్టమ్ అవార్డును గెలుచుకున్నది. బెస్ట్ యాక్టర్గా కాంతార మూవీకిగాను రిషబ్ శెట్టి అవార్డును దక్కించుకున్నాడు. బెస్ట్ హీరోయిన్ అవార్డు ఈ సారి ఇద్దరు హీరోయిన్లకు దక్కింది. నిత్యామీనన్ (తిరుచిత్రాంబళం), మానసి పరేఖ్ ( కచ్ ఎక్స్ప్రెస్ గుజరాతీ మూవీ) అవార్డులను సొంతం చేసుకున్నారు.