గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్లను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. ఈ నిర్ణయాన్ని దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలు హైకోర్టులో సవాలు చేశారు. తెలంగాణ ఎమ్మెల్సీ నియామకాలను నిలిపివేసి మరోసారి నియామక ప్రక్రియ చేపట్టాలని తెలంగాణ హైకోర్టు గతంలో తీర్పునిచ్చింది. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరోసారి అవే పేర్లను గవర్నర్కు సిఫార్సు చేశారు.