వైద్య సేవలపై ఎఫెక్ట్, రోగులు ఇబ్బందులు

కోల్ కతా ట్రైనీ డాక్టర్‌ హత్యాచార ఘటనపై ఏపీ వ్యాప్తంగా వైద్యులు, వైద్య విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో ఓపీ సేవలు నిలిపివేశారు. ఓపీలు లేవని తెలియక ఇతర జిల్లాల నుంచి తిరుపతి రుయా ఆసుపత్రికి వచ్చిన రోగులు ఇబ్బందులు పడుతున్నారు. శనివారం ఉదయం నుంచి ఓపీ సేవల కోసం రోగుల పడిగాపులు కాస్తున్నారు. అయితే ఒకరు చనిపోయారని వేలాది మందిని చంపేస్తారా? వైద్యులు, వైద్య విద్యార్థులు తమ బాధలను అర్థం చేసుకోవాలని రోగులు కోరుతున్నారు. ఘటన జరిగిన చోట నిందితులను ఉరితీయాలని, ఇక్కడ రోగుల్ని ఇబ్బంది పెట్టడం సరికాదని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది వైద్యులు నిరసన తెలిపి, మరికొంత మంది వైద్య సేవలు అందించాలని వేడుకుంటున్నారు. వైద్యుల తమ పరిస్థితిని అర్థం చేసుకుని తక్షణమే వైద్య సేవలు పునరుద్ధరించాలని కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here