అమరావతిలో నేషనల్ లా యూనివర్సిటీ
రాష్ట్ర రాజధాని అమరావతిలో నేషనల్ లా యూనివర్సిటీ ఏర్పాటు రంగం సిద్ధమైంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్తో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) అధ్యక్షుడు మన్నన్ కుమార్, ఉపాధ్యక్షుడు ప్రభాకర్న్, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అపూర్వకుమార్ శర్మ, కార్యదర్శి సుమంతో సేన్, సభ్యులు సురేశ్ చంద్ర శ్రీమాలి, అమిత్వేద్ అశోక్పాండే, నళిని చతుర్వేదిలతో కూడిన బీసీఐ ప్రతినిధి బృందం వేర్వేరుగా సమావేశం అయింది.