తొలిదశ జాబితా వారంలోపు వచ్చే అవకాశం ఉంటుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. రాష్ట్ర స్థాయిలో సుమారు 103 కార్పొరేషన్లు ఉన్నాయి. ఒక్కొక్క దానిలో ఛైర్మన్‌తోపాటు 11 మందికి డైరెక్టర్లుగా నామినేట్‌ చేసుకునే అవకాశం ఉంది. తద్వారా 1,130 మంది వరకు నామినేట్‌ చేసుకునే అవకాశం ఉంది. ఇవి కాకుండా మరో 300 పదవులు ఉండే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. జిల్లాల్లో గ్రంథాలయ సంస్థలు, మండల స్థాయిలో మార్కెట్‌ యార్డు కమిటీ పదవులు కూడా ఉన్నాయి. మొత్తం సుమారు 2,500 మందికి నామినేటెడ్‌ పదవులు దక్కే అవకాశం ఉంటుందని నేతలు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here