మంత్రి జూపల్లి కారుపై రాళ్ల సొంత పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. జూపల్లి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ.. నిరసన తెలిపారు. గద్వాల జిల్లాలో రిజర్వాయర్ల పరిశీలనకు వెళ్తున్న జూపల్లి కృష్ణారావు కారును అడ్డుకొని రాళ్లతో దాడికి దిగారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నందుకు నిరసనగా దాడి చేసినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నాయకురాలు సరిత వర్గీయులు ఈ దాడి చేసినట్టు సమాచారం. అయితే.. మంత్రి జూపల్లి సరిత తిరుపతయ్య ఇంటికి వెళ్లిగా.. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మధ్యలోనే కారు దిగి తన ఇంటికి వెళ్లిపోయారు. ఈ ఘటనతో జోగులాంబ గద్వాల జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here