ఈ లైన్ ఎందుకంటే..
ఈ కొత్త రైలుమార్గం నిర్మించే ఏరియాలో బాక్సైట్, అల్యూమినియం, ఐరన్ ఓర్, లైమ్స్టోన్, బొగ్గు, గ్రానైట్ ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. ఈ ఖనిజాలను రవాణా చేసేందుకు కొత్త రైల్వే మార్గం ఉపయోగపడనుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా సింగరేణి కాలరీస్ నుంచి ఒడిశా, ఛత్తీస్గఢ్లకు అనుసంధానం పెరుగుతుందని వివరిస్తున్నారు. దేశంలో ఖనిజ సంపదలో.. 56 శాతం ఒడిశాలోనే ఉంది. దీని రవాణాకు ఈ కొత్త లైన్ ఉతమివ్వనుంది.