రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. శుక్రవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మెదక్, సిద్ధిపేట, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షం పడింది. రాజధాని నగరం హైదరాబాద్ భారీ వర్షానికి తడిసి ముద్దయింది. శుక్రవారం సాయంత్రం స్టార్ట్ అయిన వాన.. రాత్రి వరకు దంచి కొట్టింది. హయత్ నగర్, ఆసీఫ్ నగర్, బాలానగర్, పటాన్చెరు, ఉప్పల్, అల్వాల్, కుత్బుల్లాపూర్, గోల్కొండ, కూకట్పల్లి, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ నీటి కాలువల్లా మారిపోయాయి.