AP Employees Transfers : ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది. మొత్తం 15 శాఖల్లో బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆగస్టు 19 నుంచి 31 వరకు ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని తాత్కాలికంగా నిలివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. పురపాలక, గ్రామ, వార్డు సచివాలయాలు, రెవెన్యూ, పంచాయితీ రాజ్, గనులు, పౌర సరఫరాలు, అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఇంజినీరింగ్ ఉద్యోగులు, అటవీ, రవాణా, దేవాదాయ, పరిశ్రమలు, వాణిజ్య పన్నులు, విద్యుత్, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలోని ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఉపాధ్యాయులు, వైద్యారోగ్య సిబ్బంది బదిలీలకు దూరంగా ఉన్నారు. 12 శాఖల్లో మాత్రమే బదిలీలకు అనుమతించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ నెలాఖరు లోగా ట్రాన్స్ ఫర్ల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎక్సైజ్ శాఖలో బదిలీలకు సెప్టెంబర్ 5 నుంచి 15వ తేదీ వరకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Home Andhra Pradesh ఉద్యోగుల బదిలీలకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్, మార్గదర్శకాలు జారీ-ap govt released go on...