శుక్ర‌వారం రాత్రి కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు క‌లిశారు. దాదాపు గంట సేపు జ‌రిగిన ఈ భేటీలో.. పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయడం, డిజైన్లు వంటి అంశాల‌పై చ‌ర్చించారు. కాంట్రాక్ట‌ర్ల అంశంపైనా సుదీర్ఘంగా చ‌ర్చించారు. ఈ భేటీలో సెంట్ర‌ల్ వాట‌ర్ క‌మిష‌న్ (సీడ‌బ్ల్యూసీ), పోల‌వ‌రం ప్రాజెక్టు అథార‌టీ (పీపీఏ) అధికారులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వెంట కేంద్ర మంత్రులు కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు, పెమ్మసాని చంద్ర‌శేఖ‌ర్‌, భూప‌తి రాజు శ్రీ‌నివాస‌వ‌ర్మ‌, రాష్ట్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు, టీడీపీ ఎంపీ లావు శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here