Team India: టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడానికి యంగ్ క్రికెటర్లకు ఐపీఎల్ చక్కటి వేదికగా మారింది. ఐపీఎల్లో మెరుపులు మెరిపించి జాతీయ జట్టులో చోటు ఖాయం చేసుకునేందుకు ప్రతి ఏడాది యంగ్ క్రికెటర్లు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. రింకూ సింగ్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ…ఇలా ఇటీవల కాలంలో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన క్రికెటర్లు అందరూ ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చినవారే.