Indrakeeladri Giri Pradakshina : రేపు(ఆగస్టు 19న) విజయవాడ ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా దుర్గమ్మ ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 5.55 గంటలకు ఘాట్ రోడ్డులోని శ్రీ కామథేను ఆలయం నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభం అవుతుంది. కుమ్మరిపాలెం, విద్యాధరపురం, నాలుగు స్తంభాలు, సితార జంక్షన్, కబేళా, పాల ప్రాజెక్టు, కేఎల్ రావునగర్, చిట్టినగర్, కేటీ రోడ్డు, బ్రాహ్మణ వీధి మీదుగా ఈ గిరి ప్రదక్షిణ జరగనుంది. స్వామి, అమ్మవార్ల రథాన్ని భక్తులు అనుసరిస్తూ ప్రదక్షిణ చేస్తుంటారు. సుమారు 7 కిలోమీటర్ల మేర ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ నిర్వహిస్తుంటారు. లోకకల్యాణార్థం జరుగుతున్న గిరి ప్రదక్షిణలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని దుర్గగుడి పాలకమండలి కోరింది. ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణకు వచ్చే భక్తులకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గిరిప్రదక్షిణ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేసే అవకాశం ఉంది. భక్తులకు తాగునీరు, ఆహారం ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here