హైదరాబాద్ లో క్షత్రియ భవన్ కు స్థలం కేటాయింపు
వ్యక్తిగత శ్రమ, విధేయత ఒక మనిషిని ఉన్నత స్థానానికి చేరుస్తాయని, నేపథ్యాలు వేరైనప్పటికీ కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, కర్ణాటక మంత్రి బోసురాజు అలా కష్టపడి పైకి వచ్చినవారే అని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. హైదరాబాద్ లో క్షత్రియ భవన్ కు స్థలం కేటాయింపు, అనుమతుల విషయంలో ప్రభుత్వం సహకరిస్తుందని, పేద క్షత్రియులకు కూడా సంక్షేమం అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా క్షత్రియ సేవా సమితి ముఖ్యమంత్రిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, పలువురు ప్రజా ప్రతినిధులు, క్షత్రియ సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.