రంగారెడ్డి జిల్లాలోని గండిపేట్ సరస్సు, ఎఫ్టిఎల్, బఫర్ జోన్లోని అక్రమ భవనాలను హైడ్రా ఎన్ఫోర్స్మెంట్ బృందం కూల్చివేసింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ కూల్చివేతలు చేపట్టింది. సరస్సును ఆక్రమించి నిర్మించిన అపార్ట్మెంట్లను ఎన్ఫోర్స్మెంట్ బృందాలు కూల్చివేశాయి. ఇటు హైడ్రా చర్యలను, కూల్చివేతలను నగర వాసులు స్వాగతిస్తున్నారు. తమకు తెలిసిన అక్రమ కట్టడాలు, ఆక్రమణల గురించి హైడ్రాకు తెలియజేస్తున్నారు.