కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. వాయువ్య బంగాళాఖాతం మీదుగా బంగ్లాదేశ్‌ను అనుకొని ఉన్న ప్రాంతాల మీదుగా అల్పపీడనం కొనసాగుతోందని వాతావరణ శాఖ చెప్పింది. దీనికి అనుబంధంగా ఉపరితల అవర్తనం విస్తరించి ఉందని పేర్కొంది. కొంకణ్ నుంచి ఆగ్నేయ ఆరేబియా సముద్రం ఉన్న ద్రోణి ఉందని వివరించింది. ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు మూడు రోజల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆగస్టు 21వ తేదీ వరకు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here