అరుంధతికి మిస్సమ్మ వాయనం
అదంతా వింటున్న మనోహరి కోపంతో రగిలిపోతుంది. అమర్ భార్య స్థానం నాది, నువ్వు , మీ అక్క కలిసి నా దగ్గర నుంచి ఆ స్థానాన్ని లాక్కున్నారు అనుకుంటుంది. మనోహరి చిరాగ్గా ఉండటం చూసి ఈరోజు ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు ఒక్క మనోహరి గారు తప్ప అంటుంది మిస్సమ్మ. అదేం లేదు అని కంగారు పడుతుంది మనోహరి. నలుగురికి వాయనాలు ఇచ్చావు.. ఇంకొకరికి ఇస్తే పూజ పూర్తవుతుంది లక్ష్మికి ఇచ్చేద్దాం అంటుంది నిర్మల. ఎందుకు అత్తయ్య.. పక్కింటి అక్కకి ఇస్తాను అని బయల్దేరుతుంది మిస్సమ్మ.