కాంగ్రెస్ ఏమాత్రం తగ్గడం లేదు..

ప్రతిపక్ష పార్టీలు ఏ కామెంట్స్ చేసినా.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే సచివాలయం ముందు కేటాయించిన స్థలంలోకి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసుకొచ్చారు. ఈ నెల 20వ తేదిన రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంగణాన్ని ఇటీవల మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పరిశీలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here