మూడు నంది అవార్డులు…
నేనింతే మూవీ మూడు నంది అవార్డులను గెలుచుకుంది. బెస్ట్ హీరోగా రవితేజ, బెస్ట్ డైలాగ్ రైటర్గా పూరి జగన్నాథ్, బెస్ట్ ఫైట్ మాస్టర్లుగా రామ్ లక్ష్మణ్లు అవార్డులను గెలుచుకున్నారు. రవితేజ పూరి జగన్నాథ్ కాంబోలో నేనింతేతో పాటు ఇడియన్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణంతో పాటు దేవుడు చేసిన మనుషులు సినిమాలొచ్చాయి.