ఆదాయం కోసం అన్వేషణ..
కొత్త ఆర్థిక సంవత్సరం (2024-25)లో పన్నులు, ఇతర మార్గాల్లో ఆదాయం భారీగా పెంచాలని.. ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది. వాహనాలు, మద్యం వినియోగం పెరిగినా ఇంధనం, మద్యం అమ్మకాలపై పన్నుల ఆదాయం ఆశించిన స్థాయిలో పెరగలేదు. జీఎస్టీ, రిజిస్ట్రేషన్లపై వచ్చే ఆదాయం స్వల్పంగా పెరిగినా.. బడ్జెట్ లక్ష్యాలు మాత్రం నెరవేరలేదు. దీంతో ప్రభుత్వం ఆదాయా మార్గాలను అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రెటరీ స్మితా సబర్వాల్ చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.