ఏపీఎండీసీ మాజీ ఎండీ వీజీ వెంకటరెడ్డి డిప్యుటేషన్ పొడిగింపు

సస్పెన్షన్ లో ఉన్న ఏపీఎండీసీ మాజీ ఎండీ వీజీ వెంకటరెడ్డి డిప్యుటేషన్ ను కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఏపీలో గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకట్ రెడ్డి డిప్యుటేషన్ పొడిగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వానికి కోస్టు గార్డు ప్రధాన కార్యాలయం లేఖ రాసింది. ఆగస్టు 31, 2024 వరకూ డిప్యుటేషన్ పొడిగించినట్టు సీఎస్ కు సమాచారం ఇచ్చింది. వెంకట్ రెడ్డి అవినీతి వ్యవహారాలు, సర్వీసు నిబంధనల ఉల్లంఘనలపై కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖకు తెలియచేసినట్టు పేర్కొంది. ఆగస్టు 31 తేదీతో వెంకట్ రెడ్డి ఉద్యోగ విరమణ కూడా చేయనున్నట్టు సీఎస్ కు రాసిన లేఖలో కోస్టు గార్డు తెలిపింది. తదుపరి చర్యలు ఏపీ ప్రభుత్వమే తీసుకోవాలని లేఖలో వెల్లడించింది. ఇసుక, గనుల శాఖలో అక్రమాలపై వీజీ వెంకట్ రెడ్డిని ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here