జగన్ జోక్యం చేసుకోవాలి..
తమ సమస్య పరిష్కారానికి వైఎస్ జగన్ జోక్యం చేసుకోవాలని దువ్వాడ వాణి కోరారు. దువ్వాడ శ్రీనివాస్ను పిలిపించుకొని జగన్ సూచనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. తాను, తన పిల్లలు ఏం చెప్పినా దువ్వాడ శ్రీనివాస్ వినడం లేదని.. అందుకే జగన్ జోక్యం చేసుకోవాలని కోరుతున్నట్టు వాణి వివరించారు. కేవలం దివ్వెల మాధురి కారణంగానే తన కుటుంబం రోడ్డున పడిందని.. దువ్వాడ శ్రీనివాస్ మాధురి చెప్పినట్టే వింటున్నారని వాపోయింది.