రక్షా బంధన్ సందర్భంగా.. సోమవారం జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి నివాసంలో సందడి నెలకొంది. కాంగ్రెస్కు చెందిన మహిళా నేతలు ముఖ్యమంత్రికి రాఖీలు కట్టారు. మంత్రి సీతక్క సీఎం రేవంత్కు, ఆయన మనవడికి రాఖీ కట్టారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు పర్ణికా రెడ్డి, రాగమయి సీఎంకు రాఖీ కట్టారు. బండ్రు శోభారాణి, కాల్వ సుజాత, మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద కూడా ముఖ్యమంత్రి రేవంత్కు రాఖీలు కట్టారు.