రైతు రుణ మాఫీకి సంబంధించి అన్నదాతలు చేస్తున్న ఆందోళనలపై మంత్రులు స్పందించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రుణ మాఫీకి సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఆధార్ నంబర్ 12 ఉండాలి.. కానీ కొందరికి 11 మరికొందరికి 13 నంబర్లు ఉన్నాయి. అందుకే పూర్తిగా రుణమాఫీ చేయలేకపోయాము అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరించి అర్హులైన అందరికీ రుణ మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. రుణమాఫీ మొత్తం చేయలేకపోయం.. మిగిలిన రూ. 12 వేల కోట్ల రూపాయలు రాబోయే రోజుల్లో రైతుల ఖాతాల్లో వేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here