నేరుగా గోవాకు రైళ్లు లేకపోవడం, ఉన్న రైళ్లలో ప్రయాణం నరకంలా ఉండటంతో సొంత వాహనాలు, ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళుతున్నారు. ఇకపై ప్రతి బుధవారం, శుక్ర వారాం సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామకు డైరెక్ట్ రైలును అందుబాటులోకి తీసుకురానున్నారు. గురువారం, శనివారాల్లో వాస్కోడిగామా, మాడ్గవ్ నుంచి సికింద్రా బాద్ సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. టిక్కెట్ ధరలను అధికా రులు త్వరలో ఖరారు చేస్తారు. ఏపీ ప్రయాణికులు కూడా ఈ రైలు సదుపాయాన్ని వినియోగించుకునేలా కనెక్టివిటీ కోసం టైమ్ టేబుల్ రూపొందిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.