నర్సింగ్ యాదవ్(narsing yadav)ఈ పేరు తెలియని తెలుగు సినిమా  ప్రేక్షకుడు లేడు. వెంకటేష్, శ్రీదేవి జంటగా వచ్చిన క్షణ క్షణం తో  వెండి తెర ఆరంగ్రేటం చేసి  తమిళ,హిందీ, కన్నడ భాషల్లో కూడా కలుపుకొని  సుమారు 300 కి పైగా చిత్రాల్లో  చేసాడు. రామ్ గోపాల్ వర్మ సినిమాలకి పర్మినెంట్ ఆర్టిస్టు కూడాను. కానీ  దురదుష్టవశాత్తు  2020 డిసెంబర్ 31 న అనారోగ్యంతో చనిపోయారు. ఇక లేటెస్ట్ గా నర్సింగ్ యాదవ్ భార్య, కొడుకు  మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)గురించి చెప్పిన విషయాలు  ఇప్పుడు  సోషల్ మీడియాలో వైరల్ గా నిలుస్తున్నాయి.

నర్సింగ్ యాదవ్ భార్య పేరు  చైత్ర యాదవ్. రీసెంట్ గా తన  కొడుకు రుత్విక్ యాదవ్ తో కలిసి ఒక ఇంటర్వ్యూ లో పాల్గొంది. అందులో ఆమె మాట్లాడుతు నర్సింగ్ కి చిరంజీవి అంటే  చాలా ఇష్టమని, మా ఇంటి నిండా చిరంజీవి పోస్టర్ లే ఉండేవని చెప్పుకొచ్చింది. అలాగే రుత్విక్ తో  కూడా చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని చెప్పే వాడని తెలిపింది. ఇక  రుద్విక్ కూడా మాట్లాడుతు చిరంజీవి గారంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. చిరంజీవి గురించి చాలా గొప్పగా చెప్తూ మా నాన్న  నన్ను పెంచాడు.  అలా  చెప్తున్నప్పుడు   నాన్న   కళ్ళల్లో సరికొత్త చిరంజీవి కనపడే వారని కూడా చెప్పుకొచ్చాడు.

ఇక మాస్, మనీ, మనీ, అనగనగ ఒక రోజు, నువ్వొస్తానంటే నేను వద్దంటానా, ఠాగూర్,ఇడియట్,శంకర్ దాదా ఎం బి బి ఎస్,మిరపకాయ్, ఖైదీ నెంబర్ 150 ఇలా పలు చిత్రాలు నర్సింగ్ యాదవ్ కి మంచి పేరు తెచ్చిపెట్టాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here