పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ సాక్షిగా అక్టోబర్ 10 న ఒక రసవత్తు పోరుకి రంగం సిద్ధం కానుంది. తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ అండ్ మరో సూపర్ స్టార్ సూర్య ఇందుకు ఆద్యులు కాబోతున్నారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం.
రజనీ అప్ కమింగ్ మూవీ వెట్టియాన్. జైలర్ లాంటి భారీ హిట్ తర్వాత వస్తున్న రజనీ సోలో మూవీ కావడంతో అభిమానులతో పాటు ప్రేక్షకులోను భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే అత్యంత భారీ వ్యయంతో తెరెక్కుతుంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, మలయాళ టాప్ స్టార్ ఫాహద్ ఫాజిల్, బాహుబలి ని డీకొట్టిన భల్లాల దేవా రానా కూడా రజనీ తో పాటు స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. దీంతో ఇండియాలోనే మోస్ట్ ప్రెస్టేజియస్ట్ మూవీగా వెట్టియాన్ తెరకెక్కుతుంది. ఇప్పుడు ఈ మూవీ అక్టోబర్ 10 న విడుదల కాబోతుంది. ఈ మేరకు మేకర్స్ నుంచి అధికార ప్రకటన కూడా వచ్చింది. వస్తే మంచిదే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ అదే డేట్ కి సూర్య పాన్ ఇండియా మూవీ కంగువా కూడా రాబోతుంది.ఈ మేరకు చాలా రోజుల క్రితమే అధికార ప్రకటన కూడా వచ్చింది. ఇటీవల ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యి మూవీని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆసక్తిని అందరిలో కల్గించింది. దీంతో ఈ రెండు సినిమాల రిలీజ్ విషయం ఇప్పుడు టాక్ అఫ్ ది డే గా నిలిచింది.
ఇందుకు కారణం కూడా లేకపోలేదు. రెండు సినిమాలు కూడా అత్యంత భారీ బడ్జట్ తో రూపొందాయి. పైగా రజనీ, సూర్య కి హిట్ చాలా అవసరం. ఇలాంటి టైం లో ఇద్దరు ఒకే రోజు రావడం మూవీ లవర్స్ లో క్యూరియాసిటీ ని కలిగిస్తుంది . అదే విధంగా ఎవరో ఒకరు వెనక్కి తగ్గితే బాగుండని ఇద్దరి ఫ్యాన్స్ మెసేజెస్ తో సోషల్ మీడియాని హోరెత్తిస్తున్నారు. . వెట్టియన్ కి టి జె జ్ఞానవేల్ దర్శకుడు కాగా లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. కంగువా కి శివ దర్శకుడు కాగా కే ఈ జ్ఞానవేల్ రాజా ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ నిర్మాతలు.