90 శాతం రాయితీ..
గోకులం పథకంలో భాగంగా.. పశువుల షెడ్ల నిర్మాణానికి 90 శాతం రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే గొర్రెలు, మేకలు, కోళ్లకు షెడ్లు నిర్మించుకుంటే 70 శాతం రాయితీ ఇస్తుంది. యూనిట్కు గరిష్టంగా రూ.60,900 నుంచి రూ.2,07,000 వరకు పాడి రైతులకు లబ్ధి చేకూరనుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద టీడీపీ ప్రభుత్వం గోకులం పేరుతో దీన్ని అమలు చేయనుంది. ఈ పథకం ద్వారా పాడి పరిశ్రమను ప్రోత్సహించడం, పాడి రైతులకు ఆర్థికంగా సాయం అందించడం, పశువుల ఆరోగ్య సంరక్షణ, అధిక పాల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం.