మంచికో చెడుకో తెలియదు గాని జ్యోతిష్యుడు నుంచి వివాదాస్పద జ్యోతిష్యుడు గా పేరు సంపాదించిన వ్యక్తి వేణు స్వామి(venu swamy)నూతనంగా పెళ్లి చేసుకున్న జంట ఎప్పుడు విడిపోతుందో, రాజకీయాల్లో ఎవరు గెలుస్తారో చెప్పగల మేధావి. విచిత్రం ఏంటంటే ఎవరు అడగకుండానే చెప్పేస్తుంటాడు. పైగా సినీ సెలబ్రటీస్, పొలిటికల్ సెలబ్రెటీస్ నే వేణు స్వామి టార్గెట్ పవన్ కళ్యాణ్(pawan kalyan) ప్రభాస్(prabhas)నాగ చైతన్య(naga chaitanya)సమంత(samantha)రష్మిక(rashmika mandanna)వంటి స్టార్స్ గురించి చెప్పడంతో బాగా ఫేమస్ అయ్యాడు.
వేణుస్వామి పై రీసెంట్ గా పోలీసు కేసు నమోదు అయ్యింది. హైదరాబాద్ లోని మధురా నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కి చెందిన జనరల్ సెక్రెటరీ వై.జె.రాంబాబు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ప్రసాదం రఘు వేణు స్వామి పై కేసు నమోదు చేసారు. పోలీసులు కూడా కేసుని స్వీకరించారు.