అసలేం జరిగింది?
ఈ కేసుపై డీఎస్పీ భవ్యకిషోర్ రాజమహేంద్రవరంలో సోమవారం మీడియాకు వివరాలు తెలిపారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంగర గ్రామానికి చెందిన నడిపల్లి సూర్యచంద్ర చక్ర జగదాంబ అలియాస్ బుజ్జికి పెళ్లి కాగా భర్త మృతి చెందాడు. ప్రస్తుతం ఆమె రాజమండ్రిలోని బొమ్మూరులో ఒంటరిగా నివసిస్తుంది. ఇంటి పని, వంట పని బాగా చేస్తానని వృద్ధులకు మాయమాటలు చెప్పి వారి ఇళ్లలో పనిమనిషిగా చేరుతుంది. కొన్నాళ్లు నమ్మకంగా పనిచేసి… అదును చూసుకుని ఇంటి యజమానులు తినే అన్నం, తాగే పానీయాల్లో మత్తు మందు కలిపి వాళ్లు నిద్రలోకి జారుకున్నాక, వారి ఒంటి మీద నగలతో పాటు ఇంట్లో బంగారం, డబ్బుతో దోచేస్తుంది. అక్కడి నుంచి చాకచక్యంగా పరారవుతుంది.