ఏపిలో 13 పోలింగ్ కేంద్రాల్లో వెరిఫికేషన్కు వైసీపీ విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం లోక్సభ పరిధిలో రెండు పోలింగ్ కేంద్రాల్లో, బొబ్బిలి, నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో పోలింగ్ కేంద్రంలో వెరిఫికేషన్ కోసం ఎన్నికల సంఘానికి వైసీపీ నేతలు దరఖాస్తు చేశారు. ఏపీలో గజపతినగరం, ఒంగోలు రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో13 పోలింగ్ కేంద్రాల్లో వెరిఫికేషన్ చేయాలని వైసీపీ విజ్ఞప్తి చేసింది. విజయనగరం ఎంపీగా పోటీ చేసిన బెల్లాన చంద్రశేఖర్, ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన బానినేని శ్రీనివాసరెడ్డి కోరారు.