డిసెంబర్ 9 లోపు రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తామన్నారు. ఎవడికైనా చేతనైతే రాజీవ్ గాంధీ విగ్రహం ముట్టుకోండి చూద్దామని సవాల్ విసిరారు. రాజీవ్ విగ్రహాన్ని ముట్టుకుంటే చెప్పు తెగే దాకా కొడుతామన్నారు. తాగుబోతులు, దొంగల విగ్రహాలకు సచివాలయం ముందు స్థానం లేదని ఘాటుగా స్పందించారు. తొందరలోనే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించుకుందామన్నారు. రాజీవ్ విగ్రహాన్ని పెడతామంటే తొలగిస్తామంటున్నారని, వారి బలుపును తగ్గించే బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకుంటారన్నారు.