అప్రమత్తమైన జలమండలి..
భాగ్యనరగంలో భారీ వర్షాల నేపథ్యంలో.. జల మండలి అప్రమత్తమైంది. సంస్థ ఉన్నతాధికారులు, జీఎం, డీజీఎం, మేనేజర్లతో ..ఎండీ అశోక్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. వాటర్ లాగింగ్ పాయింట్స్పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. వీలైన ప్రాంతాల్లో క్లోరిన్ బిళ్లల పంపిణీ చేయాలని.. కలుషిత నీరు సరఫరా అయ్యే ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. సీవరేజి ఓవర్ ఫ్లో అయ్యే మ్యాన్ హోళ్లను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. జీహెచ్ఎంసీ, పోలీసు శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మ్యాన్ హోళ్లు ఎట్టిపరిస్థితుల్లోనూ తెరవొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏవైనా సమస్యలుంటే కస్టమర్ కేర్ నెంబర్ 155313 కి ఫోన్ చేయాలని సూచించారు. మరో రెండు రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో.. ఉద్యోగులు, సిబ్బందికి సెలవులు రద్దు చేశారు.