సంక్షేమ గురుకులాల్లో 616 పీఈటీ పోస్టుల ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ త్వరలోనే ప్రకటించనుంది. 2017లో ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. దీనికి సంబంధించి రాత పరీక్షలు పూర్తయ్యాయి. కానీ.. విద్యార్హతలు, సాంకేతిక కారణాలతో న్యాయ వివాదాలు తలెత్తాయి. ఆ వివాదాలన్నింటినీ కమిషన్ పరిష్కరించింది. 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితాను ప్రకటించింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ముందే అభ్యర్థుల నుంచి సొసైటీల వారీగా ఆప్షన్లు తీసుకుంది. ఆ ఆప్షన్ల ప్రకారం.. తుది ఫలితాలు వెల్లడించనుంది. దీంట్లో మైనార్టీ గురుకులాల్లో 194, ఎస్సీ గురుకులాల్లో 182, బీసీ గురుకులాల్లో 135, గిరిజన గురుకుల సొసైటీలో 83, సాధారణ గురుకులాల్లో 22 పోస్టులు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here