రాఖీ పండగ రోజున తెలంగాణ ఆర్టీసీ రికార్డు సాధించింది. టీజీఎస్ ఆర్టీసీ బస్సుల్లో రికార్డు స్థాయిలో ఒక్కరోజే 63 ల‌క్ష‌ల మంది వ‌ర‌కు ప్ర‌యాణించారు. 63 లక్షమ మందిని క్షేమంగా గ‌మ్య‌స్థానాల‌కు చేర్చిన సంస్థ సిబ్బంది, అధికారుల‌ను ఎండీ వీసీ స‌జ్జ‌నార్ అభినందించారు. సోద‌ర‌భావానికి ప్ర‌తీకైన రాఖీ పండుగ‌ను కూడా త్యాగం చేసి.. భారీ వ‌ర్షాల్లోనూ నిబ‌ద్ద‌త, అంకిత‌భావం, క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ప‌నిచేశార‌ని కొనియాడారు. ర‌ద్దీలోనూ మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణ సౌక‌ర్యాన్ని విజ‌య‌వంతంగా అమ‌లు చేశార‌ని అన్నారు. ఒక్క‌రోజే 41.74 ల‌క్ష‌ల మంది మ‌హిళలను సుర‌క్షితంగా గ‌మ్య‌స్థానాల‌కు చేర‌వేశార‌ని అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here