ఒకప్పుడు ఇండియాలో బాలీవుడ్దే పైచేయిగా ఉండేది. కొందరు బాలీవుడ్ స్టార్స్, టెక్నీషియన్స్ సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంటే చాలా చిన్నచూపుతో ఉండేవారు. అలాంటి పరిస్థితి నుంచి తెలుగువారి కీర్తిని దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. బాహుబలి సిరీస్తో రాజమౌళి, ప్రభాస్ వరల్డ్వైడ్గా ఫ్యాన్ ఫాలోయింగ్ని తెచ్చుకున్నారు. ఆ తర్వాత సాహో, సలార్, కల్కి వంటి సినిమాలతో ఇండియాలోని ఏ ఇండస్ట్రీ అందుకోలేని స్థాయికి తెలుగు సినిమా చేరింది. ఇది బాలీవుడ్లోని కొందరికి మింగుడు పడని వ్యవహారంగా మారింది. అందుకే వీలు చిక్కినప్పుడల్లా తెలుగు నటీనటుల్ని, దర్శకుల్ని కించపరిచే విధంగా మాట్లాడడం, అనవసరమైన వ్యాఖ్యలు చేయడం వారికి అలవాటుగా మారిపోయింది.
ఇటీవల బాలీవుడ్ హీరో అర్షద్ వార్సి ‘కల్కి’ చిత్రం గురించి ప్రస్తావిస్తూ ప్రభాస్పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ తనకు ఓ జోకర్లా కనిపించాడని చెబుతూ డార్లింగ్ని తక్కువ చేసే ప్రయత్నం చేశాడు. అంతేకాదు, అమితాబ్ ముందు ప్రభాస్ క్యారెక్టర్ తేలిపోయిందని, మ్యాడ్మాక్స్ తరహాలో అతని క్యారెక్టర్ ఉంటుందని తాను ఊహించానని, అలా లేకపోవడంతో చాలా హర్ట్ అయ్యానని బాధను నటిస్తూ తన అక్కసును వెళ్ళగక్కాడు. అర్షద్ వ్యాఖ్యలపై పలువురు టాలీవుడ్ ప్రముఖులు స్పందించినప్పటికీ బాలీవుడ్ బాబుల నోళ్ళు మూయించే స్థాయిలో ఎవరూ కౌంటర్ ఇవ్వలేకపోతున్నారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఆ క్రమంలోనే టాలీవుడ్ హీరోగా తాజాగా స్పందిస్తూ ‘నిర్మాణాత్మకంగా విమర్శిస్తే ఎవరైనా ఆహ్వానిస్తారు. కానీ, ఇలా తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. వార్సీలో వృత్తి నైపుణ్యం లోపించడం వల్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఉన్న స్థాయి చాలా పెద్దది. వార్సి అలాంటి కామెంట్స్ చేసి ఉండకూడదు’ అని కౌంటర్ ఇచ్చారు.
ప్రభాస్కి మద్దతుగా ఇప్పటికే అభిషేక్ అగర్వాల్, సాయికుమార్, ఎస్కెఎన్ వంటి టాలీవుడ్ ప్రముఖులు తమ కామెంట్స్ను పోస్ట్ చేశారు. ఇప్పటివరకు వచ్చిన స్పందనలు సాధారణంగా ఉన్నాయని, దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే ప్రభాస్గానీ, అతని కుటుంబ సభ్యులుగానీ, అతని సన్నిహితులుగానీ అర్షద్ వ్యాఖ్యలపై స్పందించలేదు. తను చేస్తున్న సినిమాలపైనే దృష్టి పెట్టిన ప్రభాస్ ఈ కామెంట్స్ గురించి పట్టించుకున్నట్టు లేదు. ప్రస్తుతం మారుతి కాంబినేషన్లో రూపొందుతున్న ‘ది రాజా సాబ్’ షూటింగ్లో బిజీగా ఉన్నారు ప్రభాస్. ఇటీవల హను రాఘవపూడి డైరెక్షన్లో చేస్తున్న సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించిన విషయం తెలిసిందే.