ఐసెట్లో మూడో వంతు సీట్లు భర్తీ…
ఏపీలోని ప్రభుత్వ, అనుబంధ కాలేజీల్లో ఎంబిఏ, ఎంసిఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ 2024 అడ్మిషన్ల కోసం మొత్తం 21,480 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 19,665 మంది మాత్రమే అడ్మిషన్లకు కాలేజీ ఆప్షన్లను ఎంపిక చేసుకున్నారు. వారిలో 18,232 మందికి సీట్లు కేటాయించారు. రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో మొత్తం 62,076 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కన్వీనర్ కోటాలో 46,454 సీట్లుంటే అందులో సగం కూడా భర్తీ కాలేదు.