Kadapa Accident : కడపలో ఘోర ప్రమాదం జరిగింది. నగర పరిధిలోని అగాడి వీధిలో విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు బాలురు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు విద్యార్థులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషయంగా ఉందని వైద్యులు తెలిపారు. స్కూల్ నుంచి సైకిల్ పై మధ్యాహ్నం ఇంటికి వస్తుండగా.. ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రమాదం దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here