జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒకేసారి 54 మంది ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ మెమోలు జారీ చేయాలని డీఈవోను ఆదేశించారు. దీంతో 54 మందికి షోకాజ్ మెమోలు ఇచ్చారు డీఈవో కే.రాము. ఈ ఇష్యూ ఇప్పుడు జనగామ జిల్లాల్లో హాట్ టాపిక్గా మారింది. కలెక్టర్ తీసుకున్న నిర్ణయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు, జిల్లా ప్రజలు సమర్థిస్తున్నారు. చాలామంది ఉపాధ్యాయులు సరిగా విధులకు రావడం లేదని.. వారిపైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.