కోరిన కోర్కెలు తీర్చే కోడె మొక్కుల వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఏసిబి రైడ్స్ కలకలం సృష్టించాయి. ఏసీబీ అధికారులతోపాటు తూనికలు కొలతలు, పుడ్ సేఫ్టీ అధికారులు ఏకకాలంలో రాజన్న ఆలయ ప్రధాన కార్యాలయం, గోదాముల్లో తనిఖీలు నిర్వహించారు.‌ అకౌంట్స్, లడ్డు తయారీ విభాగంలో లడ్డు ప్రసాదాల నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. గోదాముల్లో ముడి సరుకుల నిల్వలను పరిశీలించిన నాణ్యతను తనిఖీ చేశారు. రికార్డుల్లో నమోదైన వివరాలు, గోదాముల్లో ఉన్న నిల్వలను పరిశీలించి తూకం వేశారు. నాణ్యత ప్రమాణాలను పరిశీలించేందుకు శాంపిల్స్ సేకరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here