దు:ఖేశ్వనుద్విగ్నమనా: సుఖేషు విగతస్పృహ: |
వీతరాగభయక్రోధ: స్థితధీర్మునిరుచ్యతే ||
భగవద్గీతలోని ఈ శ్లోకం.. దుఃఖానికి కలవరం చెందని వ్యక్తి, సుఖం కోసం పాకులాడని వ్యక్తి, అనుబంధాలు, భయం, కోపం వంటివి అధికంగా చూపించని వ్యక్తి… జ్ఞానితో సమానం అని చెబుతోంది. ఒక మనిషి భయం, కోపం వంటి వాటిలో చిక్కుకుంటే ఏదీ సాధించలేడు. ప్రాపంచిక అనుబంధాల్లో చిక్కుకుపోతే అతను తను అనుకున్నది సాధించడం కష్టమైపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రాగద్వేషాలకు పోకుండా జ్ఞానిలా, రుషిలా ఉండాలని తెలుసుకోండి.