నార్త్ ఇండియా నుంచి అంతర్రాష్ట్ర దొంగల ముఠా వరంగల్ నగరంలోకి ప్రవేశించిందని, ఎవరైనా తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకుంటే ఇంటి పక్కన ఉండేవాళ్లకో లేదంటే స్థానిక పోలీస్ స్టేషన్ లోనే సమాచారం ఇచ్చి వెళ్లాలని సూచిస్తున్నారు. వరంగల్ నగరంలోని మట్వాడా, హనుమకొండ, కాకతీయ యూనివర్సిటీ, హసన్ పర్తి, ఎల్కతుర్తి ఇలా వివిధ స్టేషన్లకు సంబంధించిన పోలీస్ అధికారులు సోషల్ మీడియా వేదికగా జనాలను అలర్ట్ చేసేలా ఆయా సందేశాలను షేర్ చేస్తున్నారు.