అసలేం జరిగింది?

నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్‌ ప్లాజా వద్ద శుక్రవారం అర్ధరాత్రి..నెల్లూరు గ్రామీణ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు వాహన సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో నెల్లూరు నుంచి చెన్నై వెళ్తున్న ఓ కారును పోలీసులు ఆపేందుకు ప్రయత్నించారు. దుండగులు కారుతో డీఎస్పీ శ్రీనివాసరావు ఢీకొట్టి పరారయ్యారు. ఈ ఘటన సమాచారం అందుతున్న వాకాడు సీఐ గూడూరు సాదుపేటలో టోల్ గేట్ వద్ద కారును అడ్డుకోబోయారు. డ్రైవర్ కారుతో సీఐని ఢీకొట్టాడు. ఈ దాడిలో గాయపడిన డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ హుస్సేన్ బాషాను నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here