ప్రభుత్వ ఉద్యోగుల డీఏని ప్రతియేటా రెండుసార్లు (జనవరి, జులై) సవరిస్తుంది కేంద్రం. అనంతర నెలల్లో వీటిపై ప్రకటనలు వెలువడతాయి. పండుగ సీజన్​ కూడా సమీపిస్తుండటంతో ఈ ఏడాది రెండో డీఏ పెంపుపై త్వరలోనే, ఇంకా చెప్పాలంటే సెప్టెంబర్​ నెలలోనే ఓ ప్రకటన వస్తుందని అంచనాలు ఉన్నాయి. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడు వచ్చినా, దాని అమలు మాత్రం 2024 జులై నుంచే ఉంటుంది. ఫలితంగా 7వ పే కమిషన్​ సిఫార్సుల ఆధారంగా ఉండే డీఏ పెంపుతో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు లబ్ధిచేకూరనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here