మహిళా కమిషన్ సభ్యులకు నోటీసులు
కేటీఆర్ కు రాఖీకట్టిన సభ్యులకు వెంటనే నోటీసులు జారీ చేయాలని, వారిపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కమిషన్ కార్యదర్శిని నేరెళ్ల శారదా ఆదేశించారు. మహిళా కమిషన్ తన నిష్పాక్షికతను లేదా న్యాయం పట్ల రాజీపడే ప్రవర్తనను సహించదన్నారు. తెలంగాణ మహిళా కమిషన్ న్యాయాన్ని నిలబెట్టడానికి కట్టుబడి ఉందన్నారు. మహిళా కమిషన్ చర్యలు మహిళల సమస్యలకు సంబంధించిన విషయాలలో అవసరమైన గంభీరత, సున్నితత్వాన్ని ప్రతిబింబించేలా ఉంటాయన్నారు. కమిషన్ కార్యాలయంలోకి మొబైల్ ఫోన్లు అనుమతించకపోయినా.. కొందరు రహస్యంగా ఫోన్లు తీసుకెళ్లి రాఖీ కట్టిన వీడియోలు చిత్రీకరించడంపై నేరెళ్ల శారద అభ్యంతరం వ్యక్తం చేశారు.