హైడ్రా యాక్షన్
ఎన్ కన్వెన్షన్ సెంటర్ అక్కినేని నాగార్జునది కావడంతో సంచలనంగా మారింది. ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత అక్రమమని హీరో అక్కినేని నాగార్జున తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తాను పట్టా భూమిలోనే కన్వెన్షన్ సెంటర్ నిర్మించానని, ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని హైకోర్టుకు తెలిపారు. ఈ మేరకు నాగార్జున హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు అక్రమంగా కూల్చివేతలు ప్రారంభించారని పిటిషన్లో పేర్కొన్నారు. భారీ క్రేనులు, 200 మంది పోలీసుల బందోబస్తుతో హైడ్రా అధికారులు శనివారం ఉదయం ఎన్ కన్వెన్షన్ ను అక్రమంగా కూల్చివేశారని కోర్టుకు తెలిపారు.