గంజాయి తాగిన ఇద్దరు యువకుల అరెస్ట్

సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో గంజాయి తాగిన ఇద్దరు యువకులను, పోలీసులు నార్కోటిక్ డ్రగ్స్ టెస్టింగ్ మిషన్ ద్వారా ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరి వ్యక్తులపై టెస్టింగ్ నిర్వహించి జిల్లాలో మొదటి కేసు నమోదు చేశారు. వారిద్దరిని అరెస్ట్ చేశారు. ములుగు మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఉన్న పౌల్ట్రీ ఫార్మ్ వద్ద ఇద్దరు వ్యక్తులు బహిరంగంగా మద్యం సేవిస్తున్నారని సమాచారం రాగా గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్ రెడ్డి, ములుగు ఎస్ఐ విజయ్ కుమార్, సిబ్బందితో కలిసి వెళ్లి తనిఖీలు నిర్వహించగా ఎలాంటి మద్యం దొరకలేదు వారి ప్రవర్తనలో అనుమానం వచ్చి నార్కోటిక్ డ్రగ్స్ టెస్టింగ్ మిషన్లతో టెస్ట్ చేయగా గంజాయి సేవించినట్లు రిపోర్టు రాగానే ఇద్దరు నిందితులు గంగబోయి స్వామి తండ్రి నర్సింలు(23), యు.సురేష్(22) లను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరూ కూడా ములుగు గ్రామస్తులే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here